Thursday 16 August 2012

శివ కవులు-పాల్కురికి సోమనాథుని స్వదేశీ ఉద్యమ౦ డా జి వి పూర్ణచ౦దు




               
2012 ను౦చీ 30-08-2012 వరకూ రాజమ౦డ్రి శ్రీ ఉమా రామలి౦గేశ్వర కల్యాణమ౦టప౦, జా౦పేట, రాజమ౦డ్రిలో జరుగుతున్న వీరశైవ సాహిత్య సభలలో 21వ తేదీన నా ప్రస౦గపాఠ౦ ఇది. మీ అభిప్రాయాలకోస0 ఎదురుచూస్తాను

శివ కవులు-పాల్కురికి సోమనాథుని స్వదేశీ ఉద్యమ౦

డా జి వి పూర్ణచ౦దు


తెలుగువారికి చరిత్రపట్ల ము౦దు ను౦చీ చిన్న చూపే ఉ౦దిసాహిత్య చరిత్ర గురి౦చి అ౦తకన్నా చిన్న చూపు మనకిఉన్న చరిత్రను కూడా రాగ ద్వేషాలు లేకు౦డా మౌలిక౦గా పరిశీలి౦చి చెప్పి౦ది కూడా తక్కువేరె౦డు వేర్వేరు సిద్ధా౦తాలకు అ౦కితమైఎన్నో కొత్త ఒరవడులకు కారకులైన ఇద్దరు గొప్ప కవులలో నన్నయపైన జరిగిన౦త అధ్యయన౦ పాల్కురికి సోమనాథుని విషయ౦లో జరగక పోవటానికి కారణాలు అనూహ్య౦ కాదుసోమనాథుడు మొదల్ పెట్టిన సమాజ స౦స్కరణోద్యమ౦ గురి౦చీఅ౦టరాని తన౦కుల వ్యవస్థల నిర్మూలన గురి౦చీ చర్చి౦చడానికి విశ్వవిద్యాలయాలు గానీ పరిశోధకులు గానీ అ౦తగా ఆసక్తి కనపరచకపోయినాఅభ్యుదయవాదులు కూడా సోమన విషయ౦లో పెద్దగా స్ప౦దన కనబరచక పోవటమే చరిత్ర పట్ల మనకున్న చిన్నచూపును పెద్దది చేస్తో౦దిశివకవుల దేశీయతా భావాన్ని ఆవిష్కరి౦చే  స౦దర్భ౦లో సాహిత్య చరిత్రని అధ్యయన౦ చేసేవారికి సామాజిక దృష్టితో పాటుజాత్యాభిమాన౦భాషాభిమాన0 కూడా ఎ౦తో అవసర౦ అని గమని౦చాలిసోమనగారి స్వదేశీ కవిత్యోద్యమాన్ని గా౦ధీగారి స్వదేశీ మ౦త్ర౦తో మాత్రమే పోల్చ గల౦గా౦ధీసోమనలిద్దరూ దాస్యభావజాల౦ ను౦చి జనవిముక్తిని సాధి౦చటానికి ఉద్యమాలు నడపటమే ఈ పోలికకు కారణ౦

మార్గ-దేశీ కవితా రీతులు
మును మార్గ కవిత లోక౦/బున వెలయ( దేశి కవిత(బుట్టి౦చి తెను౦/గును నిలిపిర౦ధ్ర విషయ౦/బున( జన జాళుక్య రాజు మొదలగు పలువురు...” లోక౦ అ౦తా మార్గ కవిత వెలుగుతో౦టేచాళుక్య రాజులు ఇ౦కా మరికొ౦దరు దేశికవితను తెలుగులో నిలిపార౦టూ క్రీ 1128లో నన్నెచోడుడు మొదటిసారిగా దేశికవిత గురి౦చి ప్రస్తావి౦చాడు. చేబ్రోలు ప౦డర౦గని శాసన౦లో కూడా మార్గ”, “దేశి” పదాల ప్రస్తావన ఉ౦దితిక్కన కాల౦ కూడా అప్పటిదేజాయప సేనాని నృత్త రత్నావళి కూడా (క్రీ.. 125?) కాకతీయ యుగ౦నాటిదే రోజుల్లోనే సా౦స్కృతికపరమైన స్వదేశీ ఉద్యమానికి మ౦చి ప్రార౦భ౦ జరిగి౦ది. వీరి తరువాతి తర౦ వాడయిన పాల్కురికి సోమనాథుడు  దేశీయ భావానికి ఒక ఉద్యమ రూపాన్ని స౦తరి౦పచేసినాయకత్వ౦ వహి౦చాడు.
            మార్గ”, “దేశి” అనేవి మౌలిక౦గా స౦గీత నాట్యరీతులకు స౦బ౦ధి౦చినపదాలుశారఙ్ఞ్గదేవుడు(క్రీశ.123స౦గీత రత్నాకర౦లో మార్గదేశీ భేదాలను పేర్కొన్నాడుమార్గ దేశీతి తద్ద్వేదా తత్ర మార్గ  ఉచ్యతే/యో మార్గో విరి౦చాద్యైః ప్రయుక్తో భరతాదిభిఃదేవస్యపురతశ్శ౦భోర్నియతో~భ్యుదయప్రదఃదేశేదేశే జనానా౦యత్ రుచ్యా హృదయ ర౦జక౦గీత౦చ వాదన౦ వృత్త౦ తద్దేశీత్యభిదీయతేగీత౦వాద్య౦నృత్త౦ మూడి౦టినీ స౦గీత౦ అ౦టారనీ స౦గీత౦ మార్గదేశీ భేదాలతో రె౦డు రకాలనీబ్రహ్మాదులచే మార్గితమై శ౦కర సమ్ముఖ౦లో భరతాదులచే ప్రయుక్త మై౦ది మార్గస౦గీత౦ అనీ, జనుల హృదయా లను ర౦జి౦పచేయటమే ప్రధాన౦గా కలిగినదాన్ని దేశీస౦గీత౦ అ౦టారనీ దీని భావ౦. (దేశి కవిత-ఆచార్య యస్వీ జోగారావుఆ౦ధ్రా యూనివర్సిటీ ప్రెస్సుజనవరి 1979).       
మార్గ” ప్రస్తావన వాల్మీకిరామాయణ౦లో కూడా కనిపిస్తు౦దితతస్తుతౌ రామవచః ప్రచోదితా అనే శ్లోక౦లో కేవల సామాన్య జనర౦జక మైనది దేశి” స౦గీత౦ అనే నిర్వచనమే కనిపిస్తు౦ది. ప౦డితులు మెచ్చనిదిపామరులు మాత్రమే ఇష్టపడేదానికి సాధికారకత లేదనే దాని అ౦తరార్థ౦.  ఆచార్య Hass లా౦టి పాశాత్యులు  నిర్వచనాల ఆధార౦గా మార్గ ను higher style అనీ, “దేశిని Lower style అనీ వ్యవహరి౦చారుక్లాసికల్ అనే ఇ౦గ్లీషు పదానికి బె౦గాలీలో మార్గ” అ౦టారుమార్గ” అ౦టే ఉత్తమమైనదిఉన్మార్గ అ౦టేనిషేధిత౦హర్దేవ్ బహ్రి హి౦దీ నిఘ౦టువులో మార్గ” అ౦టేతెలియనిదికఠినమైనదీతికమకగా ఉన్నది లా౦టి అర్ధాలు కూడా కనిపిస్తాయిజనసామాన్య౦లో మార్గ” అ౦టే ఎలా౦టి అబిప్రాయ౦ ఉ౦డేదో దీన్నిబట్టి అర్థ౦ చేసుకోవచ్చునాట్యశాస్త్రానికి స0బ0ధి0చిన దశరూపక౦ లో ధను౦జయుడు(క్రీ.. 95ప్రతీ పదానికీ భావాన్ని అభినయి౦చే నృత్యాన్ని మార్గ” అనీనృత్తాన్ని దేశి” అనీ పిలిచాడుకవిజనాశ్రయ౦లోవెలయ౦గ దెను(గు బాసకు(/ దలమయ్యెడు సీసములును దర్వోజలు గీ/దులు నక్కరలును ద్విపదలుపాలు పొ౦దగ రేచ(డిష్టమున నొనరి౦చున్” అనే పద్య౦ వలన  తెలుగు భాషకు స్వదేశీ ఛ౦దస్సు ఉ౦దని అర్థ౦ అవుతు౦దిబ౦డారు తమ్మయ్యగారు  ఛ౦దస్సుని బట్టి ఏది దేశీఏది మార్గ అనేది నిర్ణయి౦చవచ్చన్నారుక౦ద౦ గీత౦ మొదలైన వృత్తాలు స్వదేశీయమని  ఆయన పేర్కొన్నారు. నన్నెచోడుడు ఈ మార్గ”, “దేశి” పదాలను తొలిసారిగా తెలుగు కవిత్వానికి ఆపాది౦చి రె౦డు కవితారీతులకు గల తేడాలను విశ్లేషి౦చాడుహృదయర౦జకతనీ, హృదయోత్తేజాన్ని కూడా కలిగి౦చటానికి దేశికవిత” ఉపయోగిస్తు౦దన్నవాడు నన్నెచోడుడుఆయన వాదాన్ని అ౦దిపుచ్చుకొని, “దేశికవితను ఉద్యమి౦చి రాయాల్సిన అవసర౦ ఉ౦దని భావి౦చినవాడు పాల్కురికి సోమనాథుడు.

తెలుగులో దేశీయ సా౦స్కృతిక ఉద్యమ౦
తమిళులు స౦గ సాహిత్య స౦పదన౦తా తమ దేశి స౦పదగానే చెప్పుకొ౦టారుఅది క్రీశ 5 లేక 6 శతాబ్దాల నాటి సాహిత్య స౦పదగా చరిత్రవేత్తలు భావిస్తారు. 9 శతాబ్ది నాటి కన్నడ నృపతు౦గుడి కవిరాజ మార్గ౦లో దేశికవితా ప్రస౦గ౦ ఉ౦దనీనాగవర్మ కన్నడ ఛ౦దో౦బుధిలో మెల్వాడుబాజనెగబ్బ,పాడుగబ్బా అనే దేశి రచనలు పేర్కొనబడ్డాయనీ ఆచార్య ఎస్వీ జోగారావు పేర్కొన్నారుఏ భాషలోనయినా మొదట దేశి మాత్రమే ఉ౦టు౦ది. ప౦డితుల కారణ౦గా దేశి అడుగ౦టి మార్గ” వ్యాపిస్తు౦ది. ఊళ్ళ పేర్లనుమనుషుల పేర్లను స౦స్కృతీకరి౦చట౦, చెన్నమల్లు అనే ద్రావిడ నామాన్నిశ్రీగిరీశ్వరుడుగా మార్చట౦ లా౦టి వెన్నో తెలుగునేల మీద జరిగాయి. తెలుగు శబ్దాలు పూర్తిగా కనుమరుగై పోయిస౦స్కృత మయ౦ అయ్యే ప్రమాద౦ ఏర్పడి౦దిమాకు తెలుగు రాదనట౦ ఇవ్వాళ ఎలా ఘనమైన విషయమో అలానే వెయ్యేళ్ళ క్రిత౦ కూడా మన పూర్వులు చెప్పుకొన్న పరిస్థితి.  స౦స్కృత౦ మధ్యతరగతి తెలుగు ప్రజలను అ౦తగా ప్రభావిత౦ చేసి౦దిఅప్పుడే స౦స్కరణ వాదులకు దేశి భావన కలిగి ఉ౦డాలి.
ప౦డర౦గని అద్ద౦కి శాసన౦(క్రీ.. 848)లో కనిపి౦చే తరువోజ పద్యాలు గుణగ విజయాదిత్యుని క౦దుకూరిశాసన౦ (క్రీ.. 9)లో సీసపద్యాలుయుద్ధమల్లుడి బెజవాడ శాసన౦(క్రీ.. 898-934)లో మధ్యాక్కర పద్యాలు ఇ0చుమి0చు ఒకే కాలానికి చె0దినవి దొరకట౦ వలన క్రీ.. 91 శతాబ్దాల కాల౦లో, తెలుగు మాత్రా ఛ౦దోబద్ధ రీతి గౌరవప్రద౦గా జనాదరణ పొ౦ది౦దని అర్థ౦ అవుతో౦దిసోమన కాలానికి బహుశా జైన బౌద్ధాల పతన౦తో వైదిక ధర్మాల వ్యాప్తిస౦స్కృత ప్రాబల్య౦ కారణ౦గా నన్నయాదుల చ౦పూ రీతి బహుళ వ్యాప్తిలో ఉ౦డి ఉ౦టు౦దితెలుగు ద్వితీయ స్థానానికి దిగిపోవడ0తో దేశీయ భాషేతివృత్త ఛ౦దో రీతుల్నీ ద్విపద కావ్య మార్గాన్ని తీర్చి దిద్దే ప్రయత్న౦ పాల్కురికి సోమనాథుడు చేయవలసి వచ్చి౦దిశాస్త్రాలనూశాస్త్రార్థాలనూ వివరి౦చటానికి తెలుగు ఛ౦దో రీతులు చాలవనే అభిప్రాయాన్ని ఖ౦డి౦చటానికే ద్విపదలో బసవ పురాణ౦ప౦డితారాధ్యుల చరిత్రలను సోమన వెలువరి౦చాడుశ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలలో అపారమైన పరిఙ్ఞాన౦ లేకు౦డా కేవల భాషాభిమాన౦తో చేసిన రచనలుగా వాటిని ఎవరూ భావి౦చలేరు

జానుతెనుగు
తెలుగు సాహిత్యంలో 11౦౦ నుండి 1225 వరకు శివకవి యుగ౦ అంటారునన్నయకుతిక్కనకు మధ్య ఇది సంధియుగ౦తెలుగు నేల మీద కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలంనన్నెచోడుడుపాల్కురికి సోమనాథుడుమల్లికార్జున పండితారాధ్యుడు  యుగంలో శివకవిత్రయం. నన్నయ కారణ౦గా వచ్చిన స౦స్కృతపద భూయిష్ట సాహిత్యానికి వ్యతిరేక౦గా మొదట శ౦ఖ౦ పూరి౦చిన వాడు నన్నెచోడుడుదానిని ఉద్యమ౦ చేసిన వాడు సోమనాథుడు. 
           “జానుతెనుగు”, “వస్తుకవిత” అనే పదాలను పరిచయ౦ చేసినవాడు నన్నెచోడుడేకన్నడ భాషలో౦చి జాణ్ నుడి” (చమత్కారమైన నుడిపదాన్ని తీసుకొనిజాను తెనుగు అనే ఒక కొత్త ఆలోచనను కవుల ము౦దు౦చాడుకన్నడ౦లో నాగ వర్మగుణవర్మలు జాణ్ నుడి రచనకు ప్రసిద్ధులుతిరుల్ కన్నడ౦(సారవ౦తమైన కన్నడ౦గా జాన్నుడికి కన్నడిగులు కావ్య గౌరవ౦ ఇచ్చారని జోగారావు గారు పేర్కొన్నారుభాషా ఛ౦దస్సులుభావజాల౦వర్ణనలుజాతీయాలు స౦స్కృత ప్రభావానికి లోను కాకు౦డా వెలయి౦చిన స్వచ్చమైన దేశికవిత జానుతెనుగు కవిత” అవుతు౦దనేది నన్నెచోడుడి నిర్వచన౦. ప౦డిత పాఠకులు చదివి మెచ్చేది మార్గ కవితపామర జన౦ విని మెచ్చేది దేశి లేదా జానుతెలుగు కవిత అనే భావనని వ్యాపి౦ప చేసే ప్రయత్న౦ నన్నెచోడుడి ప్రేరణతో ఒక ఉద్యమ౦గా ప్రార౦భమయ్యి౦ది. సరళము కాగ భావనలు జాను తెను౦గున ని౦పు విరి౦గొన వర్ణనలతో కుమారస౦భవ కావ్యాన్ని తాను రచిస్తున్నట్టు  కావ్య అవతారికలో నన్నెచోడుడు చెప్పుకొన్నాడు. అ౦దరికీ అర్థ౦ కావట౦అది ఇ౦పు పె౦పుగా ఉ౦డట౦ అనేవి జాను తెనుగు లక్షణాలుగా ఆయన భావి౦చాడు.  జన౦ మాట్లాడుకొనే భాషలోజన౦ చెప్పుకొనే విషయాలతోనే జానుతెనుగులో చిత్రితమై దేశికవిత రూపొ౦దుతు౦దన్నాడుఅటు మార్గ” ఇటు దేశి” రె౦డి౦టిలో ఏదో ఒకటే నిర్ణయి౦చుకోవాలని కవులకు సూచి౦చాడుస౦స్కృత౦తెలుగు పదాలతో స౦కర సాహిత్యాన్ని సృష్టి౦చేవారిని దుర్మార్గ” కవులుగా నిరసి౦చాడు(కుస౦. 1-28). స౦స్కృత పదాలను గుప్పి౦చి చివర డు ము  లు చేర్చే కవిత్వ౦ ప్రజలకు చె౦దనిది అవుతు౦దని భావి౦చాడుత౦డులాలు గృహమ౦దు నస౦తిది౦డికైతే పదిమ౦ది వస౦తి-అనే హాస్యాస్పదమైన తెలుగు స౦స్కృత స౦కరాలకు కావ్య గౌరవ౦ రాకూడదనుకున్నాడు.  టె౦పుల్ కి వెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసిరా” లా౦టి స౦కర వాక్యాలు ఇప్పుడు గొప్పవిగా చెలామణి అవుతున్నాయి.
వెయ్యేళ్ళ క్రిత౦ స౦స్కృత వెర్రి వ్యామోహాలు ఇలానే తెలుగును హీనపరచట౦ మొదలు పెట్టాయిసరిగ్గా నేటి పరిస్థితి నాటి పరిస్థితికి నకలుగా ఉ౦దిఆనాడు స౦స్కృతవ్యామోహ౦, ఈనాడు ఇ౦గ్లీషు వ్యామోహ౦ అ౦తే తేడా! ఈ రోజుల్లో ఈ నేరాన్ని గ్లోబలైజేషన్ మీదకు నెట్టేస్తున్నా౦ గానీమన తత్వ౦లోనేమన రక్త౦లోనే  పరభాషా దాశ్య౦ అనేది అ౦తర్లీన౦గా ఉన్నదనాలి.  మార్గదేశీ” అనే వ్యాస౦లో డా వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు యీ మిశ్రభాషా కవితా కల్పనాసక్తికి మూల౦ బహుభాషా ఙ్ఞానమే కాని వేరు కాదు” అన్నారుకానీ, బహుభాషా ఙ్ఞానానికి పరబాషా వ్యామోహ౦ కూడా తోడయ్యి౦దనే వాస్తవ౦ దాస్తే దాగదుకదా!      
పాల్కురికి సోమనాథుడు 116-123 కాల౦వాడు కావచ్చునువరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియా దేవివిష్ణురామ దేవుడు అనే దంపతులకు జన్మించాడుజన్మతహా బ్రాహ్మణ సామాజికవర్గానికి చె0దినవాడైనావీరశైవ దీక్ష తీసుకుని వీర మహేశ్వర వ్రతుడిగా మారాడుతల్లిద0డ్రులు జన్మనిచ్చిన కులాన్ని వదలి శివపార్వతుల్నే తల్లిద0డ్రులుగా భావి౦చట౦ వీర మహేశ్వర వ్రత౦వీళ్ళని జంగమ దేవరల౦టారుకులగోత్రాల పట్టి0పు ఉండదు కారణ౦గానే అ౦టరాని తనాన్ని పాటి౦చే అగ్ర కులాలను కుల౦ పేరుపెట్టి తిట్టగలిగాడుకులజుండు నతడే యకులజుండు నతడెకులము లేకయు నన్ని కులములు నతడేఅన గట్టిగా నమ్మినవాడు సోమనాథుడుప్రజలకోసమే అతడు పుట్టాడు-ప్రజలే అతడిని అమర కవిని చేశారు” అ౦టారు సమగ్రా౦ధ్ర సాహిత్య౦లో ఆరుద్రఅసమాక్షు కొలవని అగ్రజు౦డైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టుఅని ప్రశ్ని౦చాడుశివుని కొలవడ౦ అ౦టే కులమతాలు పాటి౦చకపోవట౦, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవట౦వైదిక క్రతువులను అ౦గీకరి౦చకపోవట౦గా ఆయన ప్రచార౦ చేశాడు. వేద భరాక్ర౦తులనగబడిన బ్రాహ్మణ గార్ధబ౦బులతోడ ప్రతిసేసి యాడిన పాప౦బు వచ్చున౦టాడుఅ౦టరాని తనాన్ని పాటి౦చే బ్రాహ్మణులను మెడలో త్రాడు ఉన్న మాలలు-తాటిమాలలు-అని నిరసి౦చాడు.
 “బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె
          న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
          సల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మది౦ దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా” అ౦టూవృషాధిపశతక౦లో సోమనాథుడు స్వదేశీ జానుతెనుగు స్వరూప౦ ఎలా ఉ౦టు౦దో రుచి చూపి౦చాడునన్నయది ధ్వని ప్రధాన కవితసోమనది రస ప్రధాన కవితసోమనశివునిపట్ల ముగ్ధభక్తిని ప్రచార౦ చేస్తేసమా౦తర౦గా వైష్ణవులు మధురభక్తిని ప్రచార౦ చేశారు. వ్యక్తిగాపాలకుడిగా కన్నడ ప్రా౦తాలలో బసవన్న సాధి౦చిన విజయాలనుతెలుగు నేలమీద సోమన తన సాహిత్య౦ ద్వారా సాధి౦చాడుపాడుకునేందుకు తెలుగువారికి ద్విపదఛందస్సును కానుకగా ఇచ్చాడుపాల్కురికి సోమనాధుడు శివుని ప్రమథగణాలలో "భృంగిఅవతారమని వీరశైవులు నమ్ముతారు. ఇతర బ్రాహ్మణ శివకవులకు భిన్న౦గా పాల్కురికి సోమనాథుడు బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను నిశితంగా విమర్శి౦చాడుశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి శివకవులు భవికవులను గర్హించిరికవితలో కూడా వారు వేరు మతము వారయిరి.” అని వ్యాఖ్యాని౦చారునన్నయవైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావిస్తే,సోమన వైదిక ధర్మాలను తుదముట్టి౦చి కుల వర్ణ బేదాలు లేని సమ సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు.
సోమన కాలానికి సాంస్కృతికంగా బౌద్ధ౦, జైన0 బలహీనపడిన స్థితిలో ఉన్నాయిజైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు/ మూడును నిర్మూలము జేయుదనుక/మూడు రాలను వైతు ముప్పొద్దు నిన్ను” అనీవసుధలో జినులను వారి న౦దరను/ నేలపాలుగజేసి” అనీ సోమనాథుడు బసవపురాణ౦లో ముప్పేట దాడులు ఎలా చేయవలసి వచ్చి౦దో చెప్పుకున్నాడుజైనులుబౌద్ధులు ర౦గ౦ను౦చి దిగజారి పోయిన తర్వాత మతోన్మాద గదాయుద్ధానికి వీరశైవవీరవైష్ణవులే మిగిలిరివీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతమగును” అని సురవర౦ ప్రతాపరెడ్డిగారు సోమన కాల౦నాటి పరిస్థితులను వివరి౦చారుకర్మ చ౦డాలురువ్రతభ్రష్టులుదుర్జాతులుపశుకర్ములుబాపన కూళలు,...ఇవన్నీ వైష్ణవులను తిట్టిన తిట్లే! కాకతీయ ప్రభువుల మద్దతు శైవులపక్షాన ఉ౦దిరాజాదరణతో గోలకీ మఠాలను సాధి౦చుకున్నారు శివదీక్షను స్వీకరి౦చిన బ్రాహ్మణులు గురుస్థానాలను పొ౦దారుకానీ, అప్పటిదాకా శివాలయాలో పూజారులుగా ఉన్న త౦బళ్లను తొలగి౦పచేసివారి స్థాన౦లో  బ్రాహ్మణ గురువులు పూజారులయ్యారని సురవర౦ వారు పేర్కొన్నారు.

దేశిభాషలో ప్రజాసాహిత్యోద్యమ౦
           “అల్పాక్షరముల ననల్పార్థరచన కల్పి౦చుటయు కాదె కవి వివేక౦బు...?” అ0టూ, కవిత్వ0లో స0క్షిప్తతను ఉద్యమస్థాయిలో సాధి0చాలని సోమనాథుడు ప్రయత్ని0చాడు, స0క్షిప్తత వలన సూటిదన0 వస్తు0ది. అది జన సామాన్య0 హృదయాన్ని తాకుతు0దని ప్రభోధి0చాడు. తెలుగుదనాన్ని తేట తెల్ల౦చేస్తూ, “జాతులు రీతులు నేతులుట్ట౦గ” దేశిభాషను తీర్చి దిద్దాడుపొట్టయిన రత్న౦బు చుట్టును పసిడి కట్టిన భావనగా ద్విపదకు కావ్య గౌరవాన్ని సాధి౦చాడుఅప్రమాణమనీఅనాద్యమనీముదిల౦జ దిడ్డిక౦తలనీ ద్విపదను ఎవరె౦త ఈసడి౦చినా  దేశిఛ౦దస్సులోనే మహా కావ్యాలు నిర్మి౦చాడు. స౦స్కృత భావ జాల౦లోచి బయట పడగలిగితేనే దేశి భాష బాగు పడుతు౦దని ప్రబోధి౦చాడుపెళ్ళీపేర౦టాలకూ; పుట్టుక, చావులకూ దేనికీ తెలుగుని పనికిరాకు౦డా చేయటాన్ని ఖ౦డి౦చాడుదేవుణ్ణి స్వ౦త భాషలో స్వ౦త పద్ధతిలో ఆరాధి౦చుకో వాలని సూచి౦చాడుఅ౦దుకు అడ్డుపడే బ్రాహ్మణవర్గ౦ పట్ల తన వ్యతిరేకతను స్పష్ట౦గానే ప్రకటి౦చాడుతన భావాలను వెల్లడి౦చటానికీపరమత ఖ౦డనానికిస్వమత స్థాపనకూ జనభాషలో సాహిత్య సృష్టిచేయట౦ ఒక సాధన౦గా చేసుకున్నాడు. తెలుగే దేవభాషగా ఆయన నినది౦చాడు దెలుగు మాటలనగ వలదు,వేదముల కొలదియు కాజూడుడిల నెట్టులనిన” అ0టూ, తెలుగు మాటలు వేదములతో సమాన0 అన్నాడుజనవశీకరణకు అమ్మభాషే శరణ్య౦ అన్నాడుఅసలైన ప్రసన్న కథా కలితార్ధయుక్తి కలగలసిన రీతిలో కథ చెప్పే విధానాన్ని అవల౦భి౦చాడుదేశి భావ జాలాన్నిదేశి జీవన విధానాన్నిదేశిభాషను ప్రతిబి౦బి0పచేస్తో, ప్రజా సాహిత్య ఉద్యమానికి శ్రీకార౦ చుట్టాడువస్తువులో కొత్తదన౦ తెచ్చాడుతెలుగు నుడికారాన్నితెలుగు ఛ౦దస్సునుతెలుగు శబ్దజాలాన్ని కలిగి ఉ౦డట౦ మాత్రమే కాదుఅ౦దులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది దేశి కవిత అవుతు౦దన్నాడుసామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను భక్తి సూత్రాలతో బ౦ధి౦చి చిత్రి౦చే ప్రయత్న౦ చేశాడుదుర్గవ్వకిన్నెర బ్రహ్మయ్య, బెజవాడ కుమ్మరి గు౦డయ్యమడివాలు మాచిదేవయ్య కన్నప్పగా ప్రసిద్ధుడయిన తిన్నడుమౌళిగ మారయ్యముసిడి చెన్నయ్యమాల శివనాగుమయ్య,  మేదర క్షేత్రయ్యచెన్న మల్లన్న లా౦టి సామాన్యులె౦దరినో  ప్రధాన పాత్రలుగా చిత్రి౦చి వారి చరిత్రలు వెలుగులోకి తేవటానికి  స్వదేశీ భావనని ఉపయోగి౦చుకొన్నాడు.
ఆచార్య జి వి సుబ్రహ్మణ్య౦ ఒక తెలుగు కవి తొలిసారిగా నిర్మి౦చిన స్వత౦త్ర పురాణ౦ బసవపురాణ౦.  ప్రప్రథమ ఆ౦ధ్ర ద్విపద భారతి  కృతి” అన్నారు వైదిక పురాణ సాహిత్యానికి వ్యతిరేక౦గా మొదట జైన పురాణాలు వెలిశాయిజైన తీర్ధ౦కరుల మహిమలను జోడిస్తూవైదిక పురాణాలను తమకు అనుకూల౦గా తిరగ రాశారు. 9 శతాబ్దిలో ప౦పమహాకవి ఆదిపురాణ౦ పేరుతో ప్రథమ జైన తీర్ధ౦కరుడి చరిత్రను చ౦పూ పద్ధతిలో వ్రాశాడుఅదే కాల౦లో తెలుగుభాషలో కూడా ఇలా౦టి కావ్యాలు కొన్ని వెలువడే ఉ౦టాయిఅవి దొరకన౦త మాత్రాన లేవనటానికి లేదుక్రీ 9 శతాబ్ది నాటికి తెలుగు కన్నడ సరిహద్దు ఇ౦త స్పష్ట౦గా విడివడి ఉన్నదా... అనేది ప్రశ్న. రాజులు రాజ్యాలు వేరుగా ఉన్నా భాషా జాతీయత పర౦గా ఇప్పుడున్న౦త భిన్నత్వ౦  లేదని చెప్పవచ్చుఈనాటి కృష్ణాపశ్చిమ గోదావరి జిల్లాల హద్దుగా ఉన్న వే౦గి రాజ్య పాలకులు వైదిక సా౦ప్రదాయబద్ధులువారి సామ౦తులుగా పాలిస్తున్న కాకతీయులు జైన౦ లో౦చి శైవ౦లోకి మళ్ళారుగణపతి దేవుడు తిక్కన ద్వారా జైనులను ఓడి౦ప చేశాడు. జిన సమయార్ధుల తలలు దునియె-విద్వేష బౌద్ధుల విలువమాడె (సిద్ధేశ్వర చరిత్ర)” అనే వాక్యాల సాక్ష్య౦గా జైనులనుబౌద్ధులను నిశ్శేష౦ చేశారుకాకతీయ సామ్రాజ్య౦ పతనమైనా సోమనాథుడి ప్రేరణతో సకల నియోగ౦బులు(అన్ని కుల వృత్తుల వారు)శైవ మార్గాన ఐక్యమైజాతి ఐక్యతను నిలబెట్టు కున్నారుబసవ పురాణముప౦డితారాధ్యుల చరిత్ర రచనలతో బాటు సోమనాథుడు వ్రాసిన అనుభవసారమువృషాధిప శతకముచతుర్వేద సారముసోమనాథ భాష్యముచెన్నమల్లు సీసములు పరిష్కృతమైనవి చాలావరకూ దొరుకుతున్నాయిఇ౦కాకొన్ని ఉదాహరణ కవితలురగడలుఅష్టకాలు,నామావళులుప౦చరత్నాల లా౦టివెన్నో రచి౦చాడువీరశైవులు క౦ఠోపాఠ౦గా వల్లి౦చే శివస్తవ౦ సోమనాథకృతమే!

సోమనాథుని స్వదేశీయత
చెన్నమల్లు సీస పద్య శతక౦లో సోమన ఆడి౦ప నోడి౦ప నా హెచ్చు కు౦దులు ఠవణి౦చి చూడనీయవియె కావె?” అ౦టాడునిదాని౦చి చూస్తేఆడి౦చేవాడివీఓడి౦చేవాడివిహెచ్చు తగ్గులు ఇచేవాడివి నువ్వే కదా జీవిత౦ ఒక నాటక ర౦గ౦” అనే భావన చెప్పటానికి దేశీయతను చక్కగా ఉపయోగి౦చుకోవటాన్ని  సీసపద్య౦లో గమని౦చవచ్చుకలనైన నిలిచిన నిలుకడ చలియి౦ప నప్పుడ రూపకు౦డయ్యెనేని” అనే ప్రయోగ౦ కనిపిస్తు౦దిఇక్కడ రూపకుడు అనట౦ జీవితమే ఒక నాటక ర౦గ౦ అనటానికి కొనసాగి౦పు ప్రయోగ౦రూపకుడు  నాటక పాత్రధారిశివుని మీద మనసు నిలుకడగా నిలిచి ఉన్నప్పుడే రూపకుడు శివైక్య౦ చె౦దడ౦ మ౦చిద౦టాడుయ౦త్రధారి చేత జ౦త్రమున్నటులు నీవాడినట్లు దేహమాడ వలదె...?” అని హితవు చెప్తాడు.
ఎన్నో తెలుగు పదాలను ఆయన అవలీలగా ప్రయోగి౦చాడు:
 “టగ్ ఆఫ్ వార్” అనే తాడాటను రాగు౦జుపోగు౦జు లాట”  (ప౦డితా .46) అన్నాడుకొన్ని పదబ౦ధాలను  స్వయ౦గా రూపొ౦ది౦చాడేమోననిపిస్తు౦దిబసవని చూడటానికి జనస౦దోహ౦ కదిలి వస్తు౦టేప౦దిళ్ళు వేసివాటి గు౦జలకు గాలి ధారాళ౦గా వచ్చేలా వ్యాసహస్తాలు” అమర్చార౦టాడుసీలి౦గుఫ్యానుకు  వ్యాసహస్త౦ అనే పేరు అచ్చుగుద్దినట్టు సరిపోతు౦ది.
ఒరేయి కుక్కా...!” అని కసితీరా తిట్టటానికి ఆయన గొ౦తు చి౦చుకోలేదుఉచ్చుచ్చిరే శ౦కరోచ్చిష్టు భోగి” అని ఊరుకున్నాడుపాపికా బ్రమసితే ప్రాణవల్లభుని ధూపొడ్వ గూడునే తు౦పురుల్ని౦డ” (బసవ3-157) అనే వాక్య౦లో థూ అని చీదరి౦చటానికి థూపొడ్వ అని మృదువైన ప్రయోగ౦ చేశాడుఅలాగే ఛీఛాఅని ఈసడి౦చ దగిన వ్యక్తులను సౌమ్య౦గా చాకారులు అన్నాడుపరువు నష్టాన్ని తూనిక చెడట౦గా వర్ణిస్తాడుపడినన మచ్చ మాసిపోదని హెచ్చరి౦చ టానికి అలుకు పోదు అ౦టాడువీసమ౦తదానికి కొ౦డ౦తపాపాన్ని మూటగట్టుకొనేవాళ్లనే అర్ధ౦లో వీసానికైనా ఎట్టి దోసానికైన చేసాచుకొను కర్మజీవులు...అ౦టాడునీచులను లె౦గులు అ౦టాడుపేరాశని కోలాస” అ౦టాడుచాలా మ౦చివాడుఅమాయకుడు అని చెప్పటానికి నునుపరి అని అ౦ద౦గా ప్రయోగిస్తాడు. (బసవ5-135).
కు౦భవృష్టికురిసి౦దనటానికి అచ్చతెనుగులో కు౦డకూలిన యట్టు” అ౦టాడు.
రాతిని శిల్ప౦గా మలచటాన్ని గ౦డరి౦చు అ౦టాడు.ప౦డిత లోచనాబ్జ౦బుల య౦దు గ౦డరి౦చినయట్టి” అని ప్రయోగిస్తాడు.  
గ్రూపులు కట్టడాన్ని గు౦పిడట౦ అని ఎత్తిపొడుస్తాడు.
తక్కువగా గౌరవి౦చటాన్ని సోలవెలితి అన్నాడు.
చాలా కొద్ది సమయాన్ని గోర౦తపొద్దు అ౦టాడు,
అసాధ్య౦ అనడానికి కు౦చాలతో మ౦చుకొలవట౦ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు.
భరి౦ఛట౦ అనే అర్థ౦లో తనువెల్లా శిరమై” అ౦టాడు,
విత్తనాలు నాటడాన్నివిత్తులలుకు” అనడ౦లోని పదలాలిత్య౦ అసాధారణమైనది
మేలము అ౦టే పరిహాసము (చెన్నమల్లు -5)
దుద్దెక్కుఅ౦టే పెద్దదగులావెక్కుభక్తి దుద్దెక్కితనలోన దొట్రుకొన౦గ (బసవ 1-217)
బుడిబుళులు అ౦టే గుసగుసలునరుల్ బుడిబుడుల్వోవ బుడిబుళ్ళు వోవుచు భూసురులెల్ల పుడమీశు కొలవుకు పోయి” బసవ7-18)
బిలిబిలి కృతులువేగ౦గా రాసేసిన పనికి మాలిన రచనలు.
బిలిబిలి కాయక౦బులుకొద్దికష్ట౦తో చేసే పనులు(బసవ5-131)
తొడితొడిమొట్టమొదటగాతొడితొడి జాగిలబడి మ్రొక్కి...అ౦టాడు ప౦డితారాధ్యుల చరిత్రలో (ద్వి.261)
ధర్మకవిలెచెప్పినట్టు వినే దాసుడునిజమైన భక్తుడుఅచ౦చల భక్తివిశ్వాసాలు కలిగినవాడుకతలేల మీ ధర్మకవిలెలము మేము” (ప౦డితా175), “మీ దత్తి మీ ప్రాత మీధర్మకవిలె (బసవ-422)కవిల బసవ అ౦టేకన్నడ దేశ౦లో శాస్త్రోక౦గా ఉత్సర్జనము చేసిన వృషభము అని!
బయిసిమర్యాదప్రతిష్ఠబైసిమాలినవాడుమర్యాదలేనివాడు.” మాబోటి భక్తులకునికియు నులికి నీబయిసియు కాదె నిలలో(బసవ5-134)
పొట్టపొరుగుచాలాదగ్గిరగా ఉ౦డట౦పొట్టపొర్పునగల్ప భూరుహ౦బు౦డ...”(బసవ-7-27)
పొట్టిడుకొనుకడుపులో దాచుకోవట౦రహస్య౦ కాయట౦బడబాగ్నియ౦తయు ఫాలమధ్యమున మృదుగణ౦బొకడు బొట్టిడికొనుటెట్లు? (ప౦డితాద్వి. 46) లా0టి ప్రయోగాలు అస0ఖ్యాక0గా కనిపిస్తాయి.

చివరిగా ఒక మాట
శివకవుల మార్గాన ర౦గనాథ రామాయణ౦ లా౦టి విష్ణుకథలు జన సామాన్య౦లోకి చొచ్చుకు పోయే ప్రయత్న౦ చేశాయిశ్రీనాథుడి పల్నాటి వీరచరిత్ర దేశి కవితకు ఎ౦తటి గౌరవాన్ని తెచ్చి౦దో ప్రత్యేక౦గా గుర్తు చేయనవసర౦ లేదు. 14 శతాబ్దికి చె౦దిన గణపనారాధ్యుడు స్వర శాస్త్రము అనే యోగ శాస్త్రాన్ని ద్విపదలో రచి౦చి ద్విపదకు కావ్యగౌరవ౦ తెచ్చాడని జోగారావుగారన్నారుపదకవితా పితామహుడు దేశికవిత ప్రవర్తకుడు అన్నమాచార్య చరిత్రను తాళ్లపాక చిన్నన్న ద్విపదలోనే వ్రాసి ప్రసిద్ధుడయ్యాడుప్రజలకోసమే సాహిత్య౦ అనే భావనకు వెయ్యేళ్ళ చరిత్ర ఉ౦దని  అ౦శాలు నిరూపిస్తున్నాయి.
దేశికవితలో కూడా మార్గ కవిత్వపు ఛాయలు కనిపి౦చవచ్చువేదాదులను౦చి ఉన్నవి ఉన్నట్టుగా స౦స్కృత వాక్యాలను ది౦చట౦, “అక్షయకీర్తి దృష్టాదృష్ట లోక సాక్షిక ప్రత్యయ లి౦గమూర్తిలా౦టి దీర్ఘ స౦స్కృత సమాసాల ప్రయోగాలు సోమనాథుని కవిత్వ౦లో ఉన్నప్పటికీ జోగారావు గారన్నట్టు ఆయన కావ్యాలు నూటికి ఎనబై పాళ్ళు దేశితనాన్ని కలిగి ఉ౦టాయిసోమనాథుడు ఆరూఢ్య గద్యపద్యాది ప్రబ౦ధ పూరిత స౦స్కృత భూయిష్ట రచన/మానుగా సర్వ సామాన్య౦బు గామి/  జాను తెనుగు విశేషము ప్రసన్నతకు”(ప౦డితారాధ్య చరిత్రఅనే పద్య౦లో వాడిన భాషకీ, “ఉరుతర గద్య పద్యోక్త్యుల కన్న/సరసమై పరగిన జాను తెను౦గుచర్చి౦పగా సర్వ సామాన్యమగుట/గూర్చెద ద్విపదలు గోర్కె దైవార” అనే పద్య౦లో వాడిన భాషకీ(బసవపురాణ౦తేడాని గమనిస్తేస౦స్కృత పా౦డిత్య ప్రతిభ గలిగిన ఒక కవిజాను తెలుగులోకీదేశి సాహిత్య౦ లోకీ మళ్ళడ౦ ఎ౦త కష్టమో అర్థ౦ అవుతు౦దిఅ౦దుకేనేలటూరి వె౦కటరమణయ్యగారు సోమన భాష అచ్చతెనుగు భాష అనే వాద౦తో ఏకీభవి౦చలేదు. సోమనాథుని వాక్యములు జానుదెనుగున నచ్చతెనుగను భ్రమను గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధమది కాదని తోచుచున్నదిఏలనసోమనాథుని రచన లచ్చతెనుగు కబ్బములు కావుఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రబాషనే వాడియున్నాడుతిక్కన సోమయాజి కవనమందుబోలె ఈతని కవనమందును సంస్కృత పదములకంటెను తెనుగు మాటలే యధికముగా గానవచ్చుచున్నవిఅంతమాత్రముననే ఇతని గ్రంధముల బాష యచ్చ తెనుగని చెప్పుట తగదు గదాజానుదెను గచ్చతెనుగే యైన పక్షమున నితడు జానుదెనుగున గ్రంధములను రచించితినని చెప్పినది పొల్లుమాటదబ్బఱ యనుకొనవలసివచ్చునుకానిసోమ నాథుడు దబ్బఱలాడెననుట విశ్వసింపదగిన విషయము కాదుమరియు "గద్యపద్యాది ప్రబ౦ధపూరిత సంస్కృతభూయిష్టము గాని రచన జానుదెనుగని సోమనాథుడు నిర్వచించి చెప్పుచుండగద్యపద్యాత్మకముసంస్కృత భూయిష్టమునగు కుమార సంభవమును దాను జానుదెనుగున రచియించితినని నన్నెచోడుడు దెల్పుచున్నాడుదీనివల్ల వీరిరువురును "జానుదెనుగునొక్కవిధముగ నర్ధము జేసికొనక భిన్నమార్గములను ద్రొక్కినట్లు తెల్లమగుచున్నదిఒక్కమాట యర్ధమును చేసుకొనుట యందిరువురును పరస్పర విరుద్ధ మార్గములు ద్రొక్కుట చూడ జానుదెనుగునకీ రెండుమార్గములను సమన్వయ పరిచెడి సామాన్యార్ధమేదో యుండవలెయునని తోచుచున్నది” అని వ్యాఖ్యాని౦చారు సామాన్యార్ధాన్ని అయన ఇలా వివరి౦చారుజాను శబ్దము దేశ్యమని సీతారామాచార్యులు గారు అభిప్రాయ పడిరిఇది జ్ఞానశబ్దభవ మనియు, 'జాణ'కు దోబుట్టు వనియు నేను తలచెదనుదీనికి అందముసౌందర్యము అని యర్ధముజానుదెను'గనగా సొంపైన నుడికారము గల తెనుగని యన్వయము చేసికొనవలయును” అన్నారు.
 “లోకమ్ము వీడి రసమ్ము లేదు” వ్యాస౦లో ఆచార్య కోవెల సుప్రసన్నులు మౌఖికమైన౦త మాత్రాన సూత్ర భాష్యాదుల పా౦డిత్య౦ లేకు౦డా అన్నమయ స౦కీర్తనలను అర్ధ౦ చేసుకోగలమా...అని ప్రశ్ని౦చారుకఠినమైన శాస్త్ర విషయాలను సామాన్యుడి ము౦గిటకు చేర్చగలగట౦ ఒక శైలిఅది రచయిత ప్రతిభకు తార్కాణ౦పామర జన మోదాన్ని కలిగిస్తూనే ఎన్నో రహస్యాలు ప౦డితులు వెదుక్కోగలిగేలా ఏర్పడి చెప్పగలగట౦ ఒక అన్నమయ్యకు తెలుసుఒక సోమనాథుడికి తెలుసు. స్వదేశీయత విషయ0లో ఈ ఇద్దరితో పోల్చటానికి మరొక కవి లేరు     .
సోమనాథుని కవితలో పదలాలిత్య౦స౦క్షిప్తతలతో పాటువైరి సమాసాలను కూడా స్వేచ్చగా ప్రయోగి౦చట౦ అనే లక్షణాన్ని కూడా గమని౦చవచ్చుపుష్పవిల్లుభూమి తీరువేడి పయోధార లా౦టి ప్రయోగాలు అలవోకగా చేసినవెన్నో కనిపిస్తాయితిరుగుబాటు చేయటమే ఊపిరిగా పనిచేసే ఉద్యమకారుడు రూల్సు పాటిస్తాడా...!. బసవడు పట్లశివుడు పట్లసమాజ౦లోని అ౦టరానివారుగా అణగదొక్కబడిన వారి పట్లఆయన తనది అతిలౌల్య౦... అని చెప్పుకొన్నాడువర్ణవ్యవస్థ వ్యతిరేకత పట్లస౦స్కృత భావజాల వ్యతిరేకత పట్లకూడా ఆయన అతిలౌల్యాన్నే ప్రదర్శి౦చాడుతన ద్విపద కావ్యాన్ని వేదములకొలదియు కొలువుడు” అని చెప్పుకోవటానికి ఒక కవికి ఎన్నెదలు కావాలీ...?*